నిత్యావసర సరుకుల పంపిణీ
17-03-2026 01:59 AM
మహబూబాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరిద్ అధ్యక్షతన తన బాల్య మిత్రుడు జొన్నలగడ్డ భాను ప్రకాష్ రాధిక దంపతుల ఆర్థిక సహకారంతో ముస్లిం పేద కుటుంబాలకు ‘రంజాన్ తోఫా’ పేరుతో నిత్యావసర సరుకులను సుమారు 100 పేద కుటుంబాలకు పంపిణీ చేశారు.
డాక్టర్ డోలి సత్యనారాయణ, కే.ఎస్.ఎన్ రెడ్డి, బోడ్డుపల్లి ఉపేందర్ మాట్లాడుతూ పేదలకు సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. ఎండీ ఇస్మాయిల్, నయీమ్, బీఆర్ఎస్ నాయకులు దుగ్గి రాంగోపాల్, మహ్మద్ రఫిఖ్, జన్నే నవిన్, సట్ల రాజు, సయ్యద్ పాషా, దుగ్గి కార్తిక్, సరోజన, రజాక్, ఖాజవలి, అజ్గర్, కలిం పాల్గొన్నారు.




