ఉన్నత ఫలితాలు సాధించాలని పరీక్షా ప్యాడ్ల పంపిణీ
24-02-2026 12:09 AM
పాలకీడు, ఫిబ్రవరి 23: పాలకీడు కస్తూరిభా గాంధీ పాఠశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పాలకీడు 8వ వార్డు నెంబర్ ఎస్ కె జానీ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణి చేశారు ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ, పరీక్షలు అనేవి జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన మెట్టు. విద్యార్థులు ధైర్యంగా, నిబద్ధతతో పరీక్షలు రాస్తే ఉన్నత ఫలితాలు సాధించగలరు అని సూచించారు.
విద్యార్థులు మంచి మార్కులు సాధించి, భవిష్యత్తులో గొప్ప ప్రయోజకారులుగా ఎదగాలన్నారు,పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రోత్సాహంగా పరీక్షా ప్యాడులను పెనులను బహుమతిగా అందజేశారు. జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాదించాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ సుజాత,సామజిక కార్యకర్తలు, నాగరాజు, నవీన్, చంటి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




