ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
12-06-2026 07:28 PM
ముకరంపుర,(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజురాబాద్ లో మొదటి సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంటర్ విద్యాధికారి,ప్రిన్సిపాల్ వి.ఆంజనేయరావు నూతన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుకావాలని, అధ్యాపకులు బోధించిన వాటిని శ్రద్ధతో విని, సందేహాలను నివృత్తి చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ లెక్చరర్ వాసుదేవరావు, లైబ్రేరియన్ రాజేశం, పాల్గొన్నారు.






