calender_icon.png 13 June, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య: జాయింట్ కలెక్టర్ జె. శ్రీనివాస్

12-06-2025 07:27:12 PM

సువిశాలమైన తరగతి గదులలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన...

ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ

చండూరు (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నారని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్(District Additional Collector Srinivas) అన్నారు. గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా చండూరు మండల కేంద్రంలోని చండూర్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో, జడ్పీహెచ్ఎస్ ఎంజీఎం బోడంగిపర్తి పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో అంగరంగ వైభవంగా పునః ప్రారంభించారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాలని కోరారు. సర్కారు బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేకుండా విద్యార్థి కేంద్రీకృత విధానంలో మెరుగైన విద్యాబోధన నేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా వారి తల్లిదండ్రులకు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. నేడు విద్యారంగం వ్యాపార వస్తువుగా మారిందని, కొనుక్కునే వాడికే విద్య అందుబాటులోకి వచ్చిన ఫలితంగా పేద,మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారని వారు అన్నారు.  విశాలమైన తరగతి గదులలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన జరుగుతుందని ఆయనతెలిపారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రెండు జతల ఏకరూప దుస్తులు మరియు స్పోర్ట్స్ డ్రస్సులు అందజేయడమే కాకుండా ఉచిత పాఠ్య పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

సర్కారు బడిలో సన్నబియ్యంతో కూడిన రుచికరమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనం మరియు రాగి జావా వారానికి మూడు కోడిగుడ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో ఇంగ్లీష్ మీడియం లో బోధిస్తూ నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం ద్వారా ప్రగతిని అంచన వేస్తూ వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూన్నట్లు ఆయన అన్నారు. గ్రామంలోని బడియిడు పిల్లల విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ తద్వారా సమగ్ర గ్రామాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని గ్రామ ప్రజలకు ఆయనవిజ్ఞప్తి చేశారు.

అనంతరం భవిత సెంటర్లో విద్యార్థులకుచాక్లెట్, ఆట వస్తువులను అందించారు, అదేవిధంగా ప్రస్తుత నిర్మాణంలో ఉన్న భవిత సెంటర్ ను సందర్శించి తగు సూచనలు చేశారు.విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వి.సుధాకర్, జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎడ్ల బిక్షం, యాదగిరి, బోడంగిపర్తి మంచి కంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ డైరెక్టర్ మంచి కంటి వెంకటరమణ,దోటి వెంకన్న, ఏఇ, ఉపాధ్యాయులు , గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.