27 June, 2026 | 3:38 AM

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

27-06-2026 02:01 AM

అశ్వరావుపేట, జూన్ 26, (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం లోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా కళ్యాణ లక్ష్మి‘ పథకం కింద 32 మంది లబ్ధిదారులకు రూ 32,03,712  చెక్కులను ఎమ్మెల్యే జారే అదినారాయణ అందచేశారు.  ఈ సందర్భంగా  ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

అమ్మాయిల వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం వల్ల వేలాది కుటుంబాలు లాభపడుతున్నాయని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లబ్దిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి  ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు  తెలియజేశారు.