7 May, 2026 | 2:07 PM

Breaking News

కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •   కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •  

విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

18-06-2025 12:33 AM

గవర్నర్ చేతుల మీదుగా అందజేత

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం భారత్ సేవాశ్రమ సంఘం ఆధ్వర్యం లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. 4 వేల లాంగ్ నోట్‌బుక్స్, 1,600 షార్ట్ నోట్‌బుక్స్‌ను అందజేశారు.

నిస్వార్థంగా సేవ చేస్తున్న ఆశ్రమ కార్యదర్శి మునీశ్వరానందజీ మహారాజ్, వెంకటేశ్వరానందజీ మహారాజ్‌లతోపాటు సంఘాన్ని గవర్నర్ అభినందించారు. నాణ్యమైన విద్య ను అందించడంలో,  విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషిని గవర్నర్ ప్రశంసించారు. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో పాఠశాల అద్భుతమైన ప్రతి భను కనబరిచిందని, వచ్చే విద్యాసంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.