15 March, 2026 | 7:41 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

18-06-2025 12:33 AM

గవర్నర్ చేతుల మీదుగా అందజేత

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం భారత్ సేవాశ్రమ సంఘం ఆధ్వర్యం లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. 4 వేల లాంగ్ నోట్‌బుక్స్, 1,600 షార్ట్ నోట్‌బుక్స్‌ను అందజేశారు.

నిస్వార్థంగా సేవ చేస్తున్న ఆశ్రమ కార్యదర్శి మునీశ్వరానందజీ మహారాజ్, వెంకటేశ్వరానందజీ మహారాజ్‌లతోపాటు సంఘాన్ని గవర్నర్ అభినందించారు. నాణ్యమైన విద్య ను అందించడంలో,  విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషిని గవర్నర్ ప్రశంసించారు. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో పాఠశాల అద్భుతమైన ప్రతి భను కనబరిచిందని, వచ్చే విద్యాసంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.