calender_icon.png 27 July, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ

27-07-2025 04:41:22 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం గ్రామపంచాయతీ పరిధిలో లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్(MPDO Rajeshwar) లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసి మాట్లాడారు. మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రేషన్ కార్డులు మంజూరు నిరంతర ప్రక్రియ అని రేషన్ కార్డులు రాని అర్హులైన వారు ఆందోళన చెందకుండా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి  హరీష్, రేషన్ డీలర్ బి లింగయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ ఈద లింగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసు సంతోష్ కుమార్, పెంచాల రాజలింగు, నీలం ఆనంద్, కాపురపు సతీష్, గోసిక వినయ్ కుమార్,  నీలం రవి, సుధమల్ల శ్రీనివాస్, బేర నాగరాజ్, లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.