20-06-2025 04:40:55 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నిర్మల్ లయన్స్ క్లబ్(Nirmal Lions Club) నూతన కార్యవర్గన్ని శుక్రవారం ఎన్నుకున్నట్టు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. అధ్యక్షులుగా మేకల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా గోపాల స్వామి కోశాధికారిగా ఏ సురేష్ ఉపాధ్యక్షులుగా రాజేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా వెంకటరమణ సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ శేఖర్ రెడ్డిలను ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గంలో మరో 13 మందికి సభ్యులుగా అవకాశం ఇవ్వడం జరిగిందని వీరు ఏడాది కాలం పాటు పనిచేయడం జరుగుతుందని సభ్యులు తెలిపారు.