15-06-2025 12:02:45 AM
అర్మూర్ (విజయక్రాంతి): రక్ష స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యములో శనివారం పేదలకు బియ్యం పంపిణీ చేశారు. పట్టణములోని జిరాయత్ నగరులో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అవ్వకు బువ్వ కార్యక్రమములో ప్రతి నెలలో భాగంగా పేద వృద్దులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా దాదాపు 47 మంది పేదవృద్దులకు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ ఖాందేష్ మాట్లాడుతూ... అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా పేద వృద్దులకు తమవంతు సహకారం అందిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు. రక్షా స్వచ్చంధ సేవా సంస్థ తరపున త్వరలో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు విద్యా గోపి కృష్ణ పట్వారి, శ్రీకాంత్, కోశాధికారి గొనె శ్రీధర్, కార్యనిర్వహక కార్యదర్శులు డాక్టర్ బేతు గంగాధర్, ఖాందేష్ సత్యం, తులసి పట్వారి, మీర శ్రావణ్ సభ్యులు రాజు, గోక శరత్, సాయి, మోహన్, మహేష్ కళ్యాణ్, రాజేష్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.