calender_icon.png 4 June, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠ్య పుస్తకాల పంపిణీ

03-06-2025 12:29:58 AM

నిజాంసాగర్, జూన్ 02(విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం విద్యా వనరుల కేంద్రంలో 2025- 26 విద్యా సంవత్సరానికి    పాఠ్యపుస్తకాలను సోమవారం మండల విద్యాశాఖ అధికారి వై తిరుపతిరెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభానికి ముందుగానే పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేరవేయాలని ఉద్దేశంతో ముందుగానే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.పాఠ్య పుస్తకాల తో పాటు రెండు జతల యూనిఫామ్ లను పంపించడం జరుగుతుందన్నారు. యూనిఫారాలు ఇప్పటివరకు 80% కుట్టడం పూర్తయిందని ఆయన తెలిపారు.

మండలానికి మొదటి పార్ట్ పాఠ్యపుస్తకాలు 86% రావడం జరిగిందని ఆయన తెలిపారు.  పాఠశాలకు లైబ్రరీ పుస్తకాలను కూడా ప్రభుత్వం పంపించేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి. నిజాంసాగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం.

వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు సి ఆర్ పి బి. శ్రీధర్ కుమార్, ఎం. వరలక్ష్మి, పి. నర్సింలు ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ రాజు, కంప్యూటర్ ఆపరేటర్ అనిల్, ఐఇఆర్పిలు గైని చిన్న సాయిలు, సునీల్ కుమార్, మెసెంజర్ పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు.