03-06-2025 12:29:58 AM
నిజాంసాగర్, జూన్ 02(విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం విద్యా వనరుల కేంద్రంలో 2025- 26 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలను సోమవారం మండల విద్యాశాఖ అధికారి వై తిరుపతిరెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభానికి ముందుగానే పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేరవేయాలని ఉద్దేశంతో ముందుగానే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.పాఠ్య పుస్తకాల తో పాటు రెండు జతల యూనిఫామ్ లను పంపించడం జరుగుతుందన్నారు. యూనిఫారాలు ఇప్పటివరకు 80% కుట్టడం పూర్తయిందని ఆయన తెలిపారు.
మండలానికి మొదటి పార్ట్ పాఠ్యపుస్తకాలు 86% రావడం జరిగిందని ఆయన తెలిపారు. పాఠశాలకు లైబ్రరీ పుస్తకాలను కూడా ప్రభుత్వం పంపించేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి. నిజాంసాగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం.
వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు సి ఆర్ పి బి. శ్రీధర్ కుమార్, ఎం. వరలక్ష్మి, పి. నర్సింలు ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ రాజు, కంప్యూటర్ ఆపరేటర్ అనిల్, ఐఇఆర్పిలు గైని చిన్న సాయిలు, సునీల్ కుమార్, మెసెంజర్ పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు.