18-06-2025 12:00:00 AM
-గడువులోగా మొదటి చీర అందించాలి
-బతుకమ్మ చీరల బకాయిలు రూ.280 కోట్లు చెల్లించాం
-ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
-సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమలో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించిన విప్, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్
రాజన్న సిరిసిల్ల: జూన్ -17( విజయక్రాంతి); రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతినిండా పని క ల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఉన్న మామి డాల నారాయణ, కొండ సుభాష్ కు మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి మంగళవారం చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సంద ర్భంగా కార్మికులతో మాట్లాడారు.