calender_icon.png 8 November, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

08-11-2025 12:09:23 AM

కొత్తగూడెం,(విజయక్రాంతి): పెట్రోలింగ్ బ్లూ కోలడ్స్ కోలడ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పి రోహిత్ రాజ్ పోలీస్ అధికారు లను ఆదేశించారు. శుక్రవారం లక్ష్మీదే విపల్లి పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంద ర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచిం చారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసు కోవాలని సూచించారు.

ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధి లోని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోలట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిం చారు.పోలీస్ అధికారులు,సిబ్బంది వృత్తిపరమైన వ్యక్తిగత సమస్యలను ఎలాంటివి తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఎస్త్స్రలు రమణారెడ్డి,చంద్రశేఖర్  పాల్గొన్నారు.