8 June, 2026 | 7:04 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

15-04-2025 05:40 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి సీనియర్ మహిళ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ క్రీడల్లో పాల్గొనేందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ఎంపిక పోటీలను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, ఆశ్రమ పాఠశాల క్రీడా అధికారి బండ మీనా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు జిల్లాల నుండి 80 మంది క్రీడాకారులు పాల్గొనగా ఎంపిక పోటీల్లో క్రీడా నైపుణ్యం కనబరిచిన 20 మంది క్రీడాకారులను జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఎంపికైన వారికి ఈ నెల 18వ తేదీ నుండి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో జరగనున్న 54వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ విభాగం పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున ఎంపికైన జట్టు ప్రాతినిత్యం వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి ఎం ఓ ఉద్ధవ్, పాఠశాల హెడ్మాస్టర్ జంగు, కోచ్ లు అరవింద్, రవి, రాకేష్, సాయి, సంజీవ్, సాగర్, సీనియర్ క్రీడాకారుడు ప్రవీణ్, మాన్విత్ పాల్గొన్నారు.