calender_icon.png 15 November, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 17 నుంచి సీసీఐ మార్కెట్ యార్డ్ కేంద్రాలకు పత్తి తీసుకొని రావద్దు

15-11-2025 08:09:43 PM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

పెద్దపల్లి (విజయక్రాంతి): నవంబర్ 17 నుంచి జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ, ప్రైవేట్ కేంద్రాలకు పత్తి తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారత పత్తి సంస్థ పత్తి జిన్నింగ్ మిల్లుల విషయంలో విధించిన నిబంధనలు సడలించే వరకు నవంబర్ 17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ కొనుగోలు, ప్రైవేటు కొనుగోలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లు యాజమాన్యం తెలిపారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రైతులు మార్కెట్ కు గాని లేదా జిన్నింగ్ మిల్ వద్దకు పత్తి తీసుకొని రావద్దని అన్నారు. ఆ సీసీఐకు పత్తి అమ్ముకునే రైతులు తమ యొక్క స్లాట్ బుకింగ్ అయినా కూడా పత్తి తీసుకు రావద్దని తెలిపారు. కొనుగోళ్ల విషయంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రైతులు పత్తిని అమ్మకానికి తీసుకొని రావద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.