8 June, 2026 | 4:31 PM

Breaking News

గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరు సహకరించాలి   •   ముదిరాజ్ సంఘానికి ప్రొసీడింగ్ అందజేసిన సర్పంచ్ గండి నారాయణ   •   శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు   •   సీఎం రేవంత్‌ హిట్లర్‌ కామెంట్స్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు వివరణ   •   గ్రామ పంచాయతీలో సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాం: తాహశీల్దార్   •   పూర్తి వేతనం విడుదల చేయాలని లెక్చరర్ల వినతి   •   మద్యం మత్తు వీడితేనే గ్రామాల అభివృద్ధి ముందుకు.!   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ   •   అయ్యప్ప ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్‌కు సన్మానం   •  

నెలరోజులు మద్యం తాగొద్దు

24-12-2025 02:14 AM
  1. తాగినా, చెప్పులు వేసుకున్నా జరిమానా
  2. ఆదివాసీ గ్రామాల్లో వింత ఆచారం

ఉట్నూర్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): పుష్య మాసం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల్లో వింత ఆచారాలు అమల్లోకి వస్తాయి. ఆదివాసీలకు పుష్య మాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో జిల్లాలోని పలు ఆదివాసీ దేవతల జాతరలు నిర్వహిస్తారు. దీంతో ఈ మాసంలో మద్యం తాగడం, చెప్పులు వేసుకోవడం లాంటి వింత ఆచారాలు అమలు ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు గ్రామాల పులిమేరలోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

మద్యం తాగిన, పాదరక్షలు ధరించిన రూపాయలు 5000 జరిమానా చెల్లించాలని గూడెం వాసులు నిర్ణయించారు. ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడలో ఈ నిర్ణయాన్ని మంగళవారం నుంచి అమలు చేస్తున్నారు.  తుమ్మగూడ గ్రామానికి బయ ట వారు ఎవరైనా వస్తె ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. గ్రామ పొలిమేరలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి బ్యానర్లు కట్టారు. జనవరి 22వ తేదీ వరకు ఈ నిర్ణయం కట్టుబడి ఉంటుంది.