07-06-2025 02:12:18 AM
- జిల్లా వ్యవసాయ శాఖా టెక్నికల్ ఏడిఏ
టేకులపల్లి, జూన్ 6 (విజయక్రాంతి): రైతులెవరూ పొడదుక్కుల్లో విత్తనాలు నాటవద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జి ల్లా వ్యవసాయ కార్యాలయంలోని టె క్నికల్ ఏడిఏగా పని చేస్తున్న శోభన్ బాబు శుక్రవారం టేకులపల్లి మండలంలోని పలు పొలాలను సందర్శిం చారు. పొడి దుక్కులలో పత్తి విత్తనాలు నాటే రైతుల వద్దకు వెళ్లిపొడి దుక్కులలో పత్తి విత్తనాలు విత్తకూడదని సూచించారు.
తొ మ్మిదోమైల్ తండాలోని రైతులకు అవగాహనా కల్పిస్తూ, కనీసం రెండు నుంచి పది సెంటీ మీ టర్ల వర్షపాతం వచ్చినప్పుడు మాత్రమే రైతులు విత్తనాలు విత్తుకోవాలని తెలిపారు. అలాగే సీడ్ టాస్క్ఫోర్స్ ఏడిఏ తొమ్మిదోమైల్ తండాలోని విత్తన దుకాణాలను తనికీ చేశారు. స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్, పెర్మిషన్ కాపీ చెక్ చేయడం జరిగిందని తెలిపారు. టేకులపల్లి లోని వ్యవసాయ పరపతి సంఘం (సొసైటీ) లో అమ్ముతున్న పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ విధానాన్ని పర్యవేక్షణ చేశా రు. ఆయన వెంట వ్యసాయాధికారి అన్నపూర్ణ ఉన్నారు.