4 July, 2026 | 11:31 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

పంటలు ఎండినాక నీళ్లు ఇస్తారా?

24-09-2024 01:31 AM
  1. అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం 
  2. పాలేరు సాగర్ కాల్వ పునరుద్ధరణ పనుల పరిశీలన

ఖమ్మం, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): పంటలు ఎండిపోయాక నీళ్లు ఇస్తారా అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై మండిపడ్డారు. సోమవా రం కూసుమంచి మండలం పాలేరు ఎడమ కాల్వకు పడిన గండిని పరిశీలించారు. 2.50 లక్షల ఎకరాలు నీళ్లు లేక ఎండిపోతున్నా ఇప్పటి వరకు సాగర్ కాల్వకు పడిన గండిని పూడ్చలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి, కాల్వకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆదేశించారు. ఈ కాల్వ మీద ఆధారపడి ఐదు నియోజవకర్గాల రైతులు ఉన్నారని, కాల్వకు గండి పడి 20 రోజులు దాటినా ఎందుకు పూడ్చలేదని ప్రశ్నించారు. తనకు నివేదిక ఇవ్వాలని అక్కడే ఉన్న కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్‌ను ఆదేశించారు. అక్కడి నుంచే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో ఫోన్‌లో మాట్లాడారు. సాగునీరందక రైతులు పడుతున్న అవస్థలను వారి దృష్టికి తీసుకెళ్లారు. 

పనులను తనిఖీ చేసిన పొంగులేటి 

పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆశించిన మేర పనులు జరగకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేసే ప్రాంతంలో లైటింగ్  సరిపడేంత లేకపోవడంతో లైట్లు ఏర్పాటు చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.