23-07-2025 12:30:54 AM
వలిగొండ,జూలై 22 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన కట్ట అశోక్ తన తల్లిదండ్రులైన కట్ట లక్ష్మమ్మ హనుమయ్యల జ్ఞాపకార్థం ప్రాథమికోన్నత పాఠశాలకు 15 బెంచీలను బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవనజ్యోతి పాఠశాలకు బెంచీలు బహుకరించిన కట్ట అశోక్ ను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సలీం, బొడిగె చందు, బుంగ ప్రవీణ్, రేఖ శివకుమార్, మైసొల్ల వెంకటేష్, తాళ్ల మచ్చగిరి, గొల్ల వెంకటేష్, రాచకొండ వినయ్ తదితరులు పాల్గొన్నారు.