14 July, 2026 | 9:50 AM

కొత్త రేషన్ కార్డుల పంపిణీ

23-07-2025 12:31 AM

తాడ్వాయి, జూలై, 22( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్ గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తగా మంజూ రైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 10 ఏండ్లు పాలించిన ప్రభుత్వం ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండానే దిగిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదల కడుపు నింపడం కోసం సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేశారని, ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.  కాంగ్రెస్  నాయకులు సౌకత్ ఆలి  పాల్గొన్నారు.