08-05-2025 12:00:00 AM
సులభంగా లోన్లు ఇస్తున్నారని ఆశపడి ఆన్లైన్ లోన్ యాప్ ల వలలో చిక్కోదు
భద్రాద్రి కొత్తగూడెం మే 7 (విజయ క్రాంతి): ఈజీ మనీకి అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్, లోన్ యాప్ ల వలలో చి క్కుకొని యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు జిల్లా ఎస్పీ రోహిత్ రా జు అన్నారు. సులభంగా డబ్బు వస్తుందని ఆన్లైన్ బెట్టింగులు,గేములు,పేకాట,స్టాక్ మా ర్కెట్ ట్రేడింగులకు అలవాటు పడి సంపాదనంతా పోగొట్టుకొని ఎంతోమంది అప్పుల పాలవుతున్నారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఒకసారి కొంత మొ త్తంలో డబ్బు రాగానే ఆన్లైన్ బెట్టింగ్, రమ్మి వంటి ఆటలు మంచి ఆదాయ మార్గమని యువత భావిస్తున్నారన్నారు. మొదట్లో కొ ద్దిపాటి లాభాలు రాగానే కూర్చున్న చోటే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఎంతోమంది ఆన్లైన్ బెట్టింగు లు,గేములకు బానిసలుగా మారారని తెలిపారు.
యువత మాత్రమే కాకుండా రిటైర్ అయిన ఉద్యోగులు,పెద్దవాళ్లు కూడా ఆన్లైన్ జూదం,గేమ్స్ బారినపడి అప్పుల ఊబిలో కూరుకుపోయి తమ జీవితాలను నాశనం చే సుకుంటున్నారన్నారు. అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతునరన్నారు. ఆన్లైన్ గేములు ముందుగానే ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయనే విషయాన్ని గ్రహించలేక అనేక మంది మోసపోయి తమ డబ్బులను పోగొట్టుకుంటునరన్నా రు.
లోన్ యాప్లతో అప్రమత్తంగా ఉండాలి
మనకు అవసరం ఉన్నా, లేకున్నా నిమిషాల్లోనే అప్పులు ఇస్తామంటూ వస్తున్న ఆన్లై న్ లోన్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సులువుగా తమ ఖాతాలోకి సొమ్ము వస్తుందని లోన్ యాప్ ల నుండి అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగుల్లో, జూదంలో పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని తెలిపారు.
ఆన్లై న్ లోన్ యాప్ ల ద్వారా అప్పులు ఇచ్చే కం పెనీలు,అప్పు తీసుకున్న వారి వ్యక్తిగత వివరాలన్నీ సేకరించి వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నాయని తద్వారా అ మాయకులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని అన్నారు.తల్లీదండ్రులు తమ పిల్లల దైనందిన కార్యకలాపాలను నిత్యం గమనిస్తూ ఉండాలని ఎస్పీ సూచించారు.
బెట్టింగ్ యాప్ లలో లాభాలు వస్తాయన్నది భ్రమ అని గ్రహించాలన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లు వాడితే చట్ట ప్రకారం శిక్ష తప్పదని, బాధితులపైనా కేసులు నమోదు చేయ డం జరుగుతుందన్నారు. ఎవరైనా ఆన్లైన్ ద్వారా గానీ,నేరుగా గానీ బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.