calender_icon.png 26 June, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

25-06-2025 08:53:25 PM

దౌల్తాబాద్: గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు మద్యపానం, ధూమపానం వంటి చెడు వ్యసనాలకు యువత బానిసలై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని రాయపోలు ఎస్ఐ రఘుపతి(SI Raghupathi) అన్నారు. బుధవారం రాయపోల్ మండలం రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూన్ 26న జరుపుకునే అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదనంతర పరిణామాల గురించి రాయపోల్ పోలీస్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో యువత డ్రగ్స్ పట్ల ఆకర్షితులవుతూ శారీరకంగా అనారోగ్యానికి గురవుతున్నారు.

కొంతమందిలో మానసికంగా మార్పులు జరిగి విచక్షణ కోల్పోయి దొంగతనం, హత్యలు, హత్యాచారం, ఇతరులపై దాడికి దిగటం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ జైలుపాలు అవుతున్నారన్నారు. గ్రామాలలో ఎవరైనా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలైన సేవించేవారు ఉంటే వారి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు ఫోన్ చేసి తెలిపాలని సమాచారం ఇవ్వాలన్నారు. ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడుతాయన్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులతో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.