25-06-2025 09:02:41 PM
ఇల్లెందు (విజయక్రాంతి): భార్యభర్తల మధ్య వివాదం కేసులో భర్త తల్లీదండ్రులతో దురుసుగా ప్రవర్తించి వారి హక్కులకు భంగం కలిగించినందులకు గాను మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి(IG Chandrasekhar Reddy) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ(CI Battula Satyanarayana)ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. పోలీసు అధికారులు గానీ, సిబ్బంది గానీ ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తే శాఖాపరమైన విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తప్పవని ఈ సందర్బంగా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.