calender_icon.png 1 June, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దు

05-04-2025 12:00:00 AM

కామారెడ్డి డిక్లరేషన్ అమలుపరిచే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం

బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జసత్యం

ముషీరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్లను రాజకీ యం చేయొద్దని, కామారెడ్డి డిక్లరేషన్ అమ లు పరిచేంతవరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ పేర్కొన్నారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన బీసీ మేధావుల, విద్యావంతుల, ఉద్యమకారుల సమా వేశంలో దాసు సురేశ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్స్ పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండానే ఢిల్లీలో ధర్నాలను చేస్తుండటం, కేంద్రంపై దుమ్మెత్తటం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు.

బీసీ బిల్లులు గవర్నర్ ఆమోదం పొంది 42 శాతం రిజర్వేషన్లతో నోటిఫికేషన్ వెల్లడించేంతవరకు ప్రభుత్వాన్ని నమ్మేదే లేదన్నారు. 5 సం.లు బీసీలకు రూ.1 లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్న కాంగ్రెస్ హామీ, ఇప్పటివరకు కేవలం రూ.20 వేల కోట్లని ప్రతిపాదించి, కనీసం ఐదు కోట్లు కూడా ఖర్చు చేయలేని దయనీయ స్థితిలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను, సామాజిక ఉద్యమ సంఘాలను, కుల సంఘాలను, సరిగ్గా సమన్వయం చేయకుండానే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని సీఎం చేసిన అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు.

ఈ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జసత్యం మాట్లాడుతూ రిజర్వేషన్లపై కాంగ్రెస్ బిజెపి పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లపై రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాతీయ ప్రధా న కార్యదర్శి కోలా జనార్దన్, నిరుద్యోగ జే ఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ముదిరాజ్ మా ట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి నాయకులు పద్మావతి, మాధవి, మంద వెంకటస్వామి, జ్యోతి, శారద, కృష్ణ, నారోజు శ్రీనివాసచారి, లింగస్వామి, సూర్యనారాయణ, రామగిరి ప్రకాష్ పాల్గొన్నారు.