06-06-2025 12:00:00 AM
టీఎస్యూటీఎఫ్
ముషీరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్ల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన చేసే దోరణి సరైంది కాదని టియస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటి పేర్కొంది. రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయం దోమల్డూడలో గురువారం జరిగింది.
ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ మాట్లాడుతూ.. సమస్యలను ప్రభుత్వం గమనించకపోచే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. గురుకు ల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కెజిబివి పాఠశాలల్లో పనిచేసే ఉద్యో గ, ఉపాధ్యాయులకు ఇప్పటికీ మొ దటి తారీఖున వేతనాలు అందడంలేదన్నారు.
పెండింగ్ బిల్లుల చెల్లిం పు విషయంలో ఇచ్చిన హామి కూ డా అమలు చేయలేదన్నారు. 5 పెండింగ్ డిఏలలో కనీసం మూడు డిఏల నైనా వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి హెచ్. దుర్గాభవాని, రాష్ట్ర కోశాధికా రి టి.లక్ష్మారెడ్డి, పత్రిక ప్రధాన సం పాదకులు పి.మాణిక్రెడ్డి, ఎఫ్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర చైర్మన్ రాజశేఖర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సోమశేఖర్, శాంతికుమారి, సమ్మారావు, సత్యానంద్, నా గమణి, కె.రంజిత్కుమార్, యస్.మ ల్లారెడ్డి, కె.రవికుమార్, ఎ.సింహాచలం, వై.జ్ఞానమంజరి, యం. వెంకటప్ప, రాష్ట్ర కార్యదర్శి జి.వి. నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.