calender_icon.png 30 May, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులను నమ్మొద్దు....ఎవరికి రూపాయి ఇవ్వొద్దు...

28-05-2025 01:08:13 AM

 - అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం

 - ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

సిరిసిల్ల, మే 27 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇల్లు మంజూ రు చేస్తామని దళారుల మాటలు నమ్మి ఎవరికీ రూపాయి ఇవ్వవద్దని ప్రభుత్వ విప్, వేములవాడ ఎ మ్మెల్యే ఆదిశ్రీనివాస్ స్పష్టం చేశారు.

నియోజవర్గంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం రెండో విడత క్రింద వేము లవాడ రూరల్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు 333 ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వులు విప్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. నియోజకవర్గం లో మొత్తం 3500 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. 

వేములవాడ నియోజకవర్గం లోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని ఉద్దేశంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అదనంగా ఇవ్వాలని కోరానని దీంతో ఆయన వెంటనే స్పందించి 1750 మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, పిడి హౌసింగ్ శంకర్,మండల ప్రత్యేక అధికారి లక్ష్మీరాజ్యం, ఎంపీడీఓ, తహసిల్దా ర్, సంబంధిత అధికారులు, ఇందిరమ్మ కమిటీ సబ్యులు, తదితరులు పాల్గొన్నారు.