17-06-2025 08:17:16 PM
వాజేడు (విజయక్రాంతి): వాజేడు మండల పి హెచ్ సి పరిధిలో గల కొప్పుసూరు, కొప్పుసురు కాలనీలో మంగళవారం వాజేడు వైద్యులు డాక్టర్ మహేందర్(Dr. Mahender) ఆధ్వర్యంలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారికి ఆర్ డి టి రక్త పూత సేకరణ పరీక్షలు చేశారు. గర్భిణీలను, బాలింతలను పరిశీలించి తగిన సలహాలు సూచనలు చేశారు. అదేవిధంగా డ్రైడే కార్యక్రమం మలేరియా సర్వే మురికి గుంటలలో తిమోపాస్ మందు చల్లడం వంటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.