calender_icon.png 17 June, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామిడిగూడెం ఇసుక స్టాక్ యార్డ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి

17-06-2025 08:19:52 PM

మంగపేట (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) మంగపేట మండలం మల్లూరు గ్రామపంచాయతీ పరిధిలోని మామిడిగూడెంలో ఇసుక క్వారీకి సంబంధించిన ఇసుక స్టాక్ యార్డ్ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండానే ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి, వే బ్రిడ్జి ఏర్పాటు కోసం స్థలం రెవిన్యూ శాఖ అధికారులు కేటాయించలేదంటున్నారు. గ్రామపంచాయతీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసి) ఇవ్వలేదంటున్న పంచాయతీ అధికారులు.

పంచాయతీ రోడ్డును, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని, ఎలాంటి అనుమతులు లేకుండానే వే బ్రిడ్జి ఏర్పాటు చేయడమే కాకుండా పెసా గ్రామ సభ తీర్మాణం లేకుండా, పెసా, ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా వేబ్రిడ్జి ఏర్పాటు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టని రెవిన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు తూనికలు కొలతల శాఖ అధికారులు వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీ చేయకపోయినా వే బ్రిడ్జి వద్ద కాంటా నిర్వాహకులు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.