15-06-2025 10:47:26 PM
ఎల్బీనగర్: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, సోషల్ ఆర్గనైజర్ ఎల్బీనగర్ కు చెందిన డాక్టర్ రుద్రాల స్వామి సేవాభూషణ్ అవార్డు(Seva Bhushan Award) అందుకున్నారు. తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారి జానపద కూచిపూడి నృత్య సంబరాలు, ప్రతిభ అవార్డులు కార్యక్రమం- జాతీయ కవి సమ్మేళనం సందర్భంగా సినీ సంగీత విభావరిని ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో స్వామికి సినీనటి శ్వేత బసరాజ్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. అంతర్జాతీయ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ ధనాసి ఉషారాణి, సీఈవో యూవీ రత్నం, గాయకులు చందోలు ప్రసన్న, లక్ష్మీరత్నం, మాలతి నాయుడు, డాక్టర్ విజయలక్ష్మి హరికుమార్, ఇంద్రకుమార్ తదితరులు స్వామికి శుభాకాంక్షలు తెలిపారు.