18-01-2026 06:01:51 PM
తాండూరు,(విజయక్రాంతి): ఆపద సమయంలో ఓ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకొని మానవత్వాన్ని చాటుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు ప్రముఖ వైద్యులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ ఆదివారం తాండూర్ పట్టణం14వ వార్డ్ చెందిన వెంకటమ్మ అనే వృద్ధురాలు అకాల మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె అంతక్రియలకు ఆర్థిక సాయం అందజేశారు. అత్యవసర సమయంలో ఆర్థిక సహాయం అందించి ఆదుకోవడంతో మృతురాలు వెంకటమ్మ కుటుంబ సభ్యులు డాక్టర్ సంపత్ కు కృతజ్ఞతలు తెలిపారు.