25 June, 2026 | 3:21 PM

Breaking News

మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్   •   తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక.   •   దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం   •   ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలి   •   విత్తన డీలర్లకు వ్యవసాయ నైపుణ్య పాఠాలు   •   నల్లమల అడవి నుంచి ఉడుముల అక్రమ రవాణా   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి   •   కంటైనర్ ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు   •   పక్క జిల్లాలకు నీళ్లు... కరీంనగర్ ప్రజలకు కన్నీళ్లు   •   చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ముందడుగు   •  

నిర్దేశిత కక్షలోకి ‘దృష్టి’

04-05-2026 12:20 AM
  1. కక్షలోకి ఆప్టో-సార్ ఉపగ్రహం
  2. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ కొత్త రికార్డు 

న్యూయార్క్, మే ౩: భారతీయ అంతరిక్ష పరిశోధన రంగంలో ఆదివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘గెలాక్సీ ఐ’ రూపొందించిన ‘మిషన్ దృష్టి’ ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కాలిఫోర్నియాలోని స్పేస్‌ఎక్స్ ఫాల్కన్- 9 రాకెట్ ద్వారా చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. 190 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం భారత్ నుంచి ప్రైవేట్ రంగంలో తయారైన అతిపెద్ద ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌గా రికార్డు సృష్టించింది.

ప్రపంచంలోనే మొదటిసారిగా ఆప్టికల్ కెమె రా, సింథటిక్ అపెర్చర్ రాడార్ (ఆప్టోసార్) సాంకేతికతతో ప్రయోగించడం దీని ప్రత్యేకత. ఈ సాంకేతికతతో అంతరిక్షంలో వాతావరణం ఎలా ఉన్నా దూరం నుంచి భూమికి సంబంధించిన చిత్రాలు తీయడం సాధ్యమవుతుంది. సాధారణ ఉపగ్రహాలు మేఘాల చాటున ఉన్నా లేదా చీకటిలో ఉన్నా స్పష్టమైన ఫొటోలు తీయలేవు.

కానీ, ఆప్టో-సార్ సాంకేతికత ఆ అడ్డంకులను అధిగమించి హై-రెజల్యూ షన్ (హెచ్‌డీ) చిత్రాలను అందిస్తుంది. ఉపగ్రహం ద్వారా వచ్చే డేటాతో వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగాలకు విశిష్ట సేవలు అందుతాయి. మరోవైపు, ఈ విజయంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) హర్షం వ్యక్తం చేసింది. అలాగే ‘గెలాక్సీ ఐ’ బందాన్నీ అభినందించింది.