31-05-2025 06:29:19 PM
ఖమ్మం (విజయక్రాంతి): నేడు రిటైర్డ్ అవుతున్న డ్రైవర్ మోహన్ ను ప్రభుత్వ అస్పత్రి ఆర్ఎంఓ డా. రాంబాబు, ఏడి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం ప్రభుత్వ అస్పత్రిలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డా. రాంబాబు మాట్లాడుతూ... మోహన్ అంకిత భావంతో తన వృత్తి చేసే వారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆఫీసు సూపర్డెంట్లు, రవి కిషోర్, శ్రీనివాస్, నంద శ్రీనివాసరావు, నర్సింగ్ సూపర్డెంట్లు, ఆఫీస్ సిబ్బంది రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.