31-05-2025 06:26:47 PM
భద్రాచలం (విజయక్రాంతి): ప్రపంచ సాహితీ సదస్సుకి ఎంపిక కావడమే కాకుండా కవిరత్న జాతీయ పురస్కార్ అవార్డు(Kaviratna National Award) పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ కవి సురేష్ బాబు తోటమళ్లను భద్రాచలం సబ్ ట్రెజరీ అధికారిణి తెల్లం సుభద్ర(Sub Treasury Officer Tellam Subhadra) శనివారం ట్రెజరీ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ టి ఓ సుభద్ర మాట్లడుతూ... తమ ట్రెజరీ పరిధిలోని తేగడ హైస్కూలు లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ కవిరత్న పురష్కార్ పొంది భద్రాద్రి ఖ్యాతి జాతీయ స్థాయిలో పెంపొందించారని కొనియాడారు.
ఇప్పటికే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్, బెస్టు ఎంఎల్వో, బెస్టు ఎం.హెచ్.ఓ అవార్డ్స్ తో పాటు పలు రంగాలలో అవార్డ్స్ తీసుకోవడం, ఇటీవల విడుదలయిన పదో తరగతి ఫలితాలలో సైన్స్ సబ్జెక్టు నందు నూరు శాతం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేసి భవిష్యత్ లో మరిన్ని ఆవార్డ్స్ పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమం నందు సీనియర్ అకౌంటెంట్స్ కె .క్రాంతి కుమార్, ఎం .ఉషారాణి, ఓ ఎస్ రంజాన్ లు పాల్గొన్నారు.