ఏరియా జీఎం కార్యాలయంలో డ్రైవర్స్ రెస్ట్ హాల్ ప్రారంభం
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియా జి.ఎం కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రైవర్స్ రెస్ట్ హాల్ ను ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలెం రాజు గురువారం రోజు న ప్రారంభించారు. డ్రైవర్లకు మెరుగైన సౌకర్యాలు, విశ్రాంతికి అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు, ఈ రెస్ట్ హాల్ ను ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
నూతన రెస్ట్ హాల్ లో డ్రైవర్లకు సౌకర్యవంతమైన సీటింగ్, విశ్రాంతికి అనుకూలమైన వాతావరణం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ, తమ కోసం ప్రత్యేకంగా ఆధునిక సౌకర్యాలతో రెస్ట్ హాల్ ఏర్పాటు చేసిన ,జి.ఎం ఎం. షాలెం రాజు కి, సిబ్బంది సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎస్.ఓ.టు జి.ఎం కోటిరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జి.ఎం ఎం. షాలెం రాజు , ఎస్.ఓ. టు జి.ఎం కోటిరెడ్డి , ఏజీఎం (సివిల్) రామకృష్ణ , ఏజీఎం (ఫైనాన్స్ ) బీభత్స , వికేసిఎం ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహారావు డి.వై.ఎస్.ఇ రాజారాం , పర్సనల్ మేనేజర్ ఎల్ .తిరుపతి ,సీనియర్ పిఓ ఎం. మురలి , ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎండి రజాక్ , (ఎస్ సీ/ఏస్ టీ వెల్ఫేర్ జనరల్ సెక్రెటరీ) అంతోటి నాగేశ్వరరావు , ఇతర అధికారులు,యూనియన్ నాయకులు మరియు డ్రైవర్స్ పాల్గొన్నారు.






