calender_icon.png 25 June, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ అనర్ధాలకు దారితీస్తుంది

24-06-2025 10:55:31 PM

యువత చదువు, క్రీడలపై దృష్టి సారించాలి..

డీఎస్పీ శ్రీధర్ రెడ్డి విద్యార్థులకు సూచన..

కోదాడ: డ్రగ్స్ అనర్ధాలకు దారితీస్తుందని, యువత చదువు, క్రీడలపై దృష్టిసరించాలని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి(DSP Sridhar Reddy) అన్నారు. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ గ్రామ శివారులో ఉన్న తేజ విద్యాలయంలో మంగళవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి(Excise Deputy Commissioner Somi Reddy) ఆధ్వర్యంలో డ్రగ్స్ అనర్ధాలు అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. సమాజంలో మంచి వ్యక్తిగా ఎదగాలంటే మంచి అలవాట్లు అలవార్చుకోవాలన్నారు.

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తుతో అనేక అనర్ధాలు ఉన్నాయని, వాటితో ఎంతో మంది జీవితాలు పాడైపోయినట్లు తెలిపారు. విద్యార్థులు ఇంట్లో పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు డ్రగ్స్ మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను వివరించి వారిలో పరివర్తనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రూరల్ రజిత రెడ్డి, అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.