24-06-2025 11:00:49 PM
బంగారు నగల కోసమే హత్య చేశారని అనుమానాలు..
గజ్వేల్: గజ్వేల్ మండలం(Gajwel Mandal) ధర్మారెడ్డి పల్లె గ్రామ శివారులో ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ధర్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన నల్ల సత్తెమ్మ(70) వ్యవసాయ పొలాల వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో రైల్వే బ్రిడ్జి దగ్గర గొంతు కోసి హత్య చేశారు. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ్వేల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. మృతురాలు మెడలో బంగారం దొంగిలించినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.