24-06-2025 10:52:24 PM
సూర్యాపేట (విజయక్రాంతి): పట్టణంలోని ఎంజి రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహ సమీపంలో గల తిరుమల గ్రాండ్ హోటల్(Tirumala Grand Hotel)లో మంగళవారం మధ్యాహ్నం హోటల్ కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన ఇద్దరు కస్టమర్లకు ఈగలు, వెంట్రుకలు ఉన్న బిర్యానీ పెట్టారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని గమనించిన మున్సిపల్ కమీషనర్ ఆదేశాల మేరకు శానిటరీ సిబ్బంది వెంటనే హోటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసారు.
ఆహార పదార్ధముల విషయంలో కొంత నిర్లక్ష్యం వేయిస్తున్నారంటూ యాజమాన్యానికి రూ.5 వేల జరిమాన విధించారు. అనంతరం మున్సిపాలిటీ సిబ్బంది మాట్లాడుతూ... ఆహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యం చేసిన హోటల్ పై చర్యలు తప్పమన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, యాదగిరి, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివ ప్రసాద్, జవాన్లు పోతుగంటి వేణు, బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.