calender_icon.png 17 November, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

17-11-2025 01:49:05 AM

పట్టుబడ్డ 468 మంది మందు బాబులు

శేరిలింగంపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు  కొరడా ఝుళిపిస్తున్నారు.శనివారం రాత్రి 16 పిఎస్ లిమిట్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 468 మంది మద్యం సేవించిన వారు చిక్కారు. ఇందులో 335 టూ వీలర్స్, 25 త్రీ వీలర్స్,107 ఫోర్ వీలర్స్, 1 హెవీ వెహికల్స్ ను పోలీసులు సీజ్ చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు,ఇతరుల ప్రాణాలకు కారణమైన వారిపై భారతీయ న్యాయ సన్హిత 2023 చట్టం, 105 సెక్షన్ కింద గరిష్ఠంగా 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు పోలీసులు హెచ్చరించారు.