15-07-2025 09:47:50 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): గ్రామంలో ఎటువంటి నేరాలు, దొంగతనాలు జరగకుండా , ఏదైనా నేరం జరిగిన కూడా సిసి కెమరాల ద్వారా నిందితులను గుర్తించుటకు అవకాశం ఉంటుందని ఒక సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పని చేస్తుందని నల్లగొండ డిఎస్పీకే శివరామిరెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పోలీసుల సూచన మేరకు దాతల సహాయంతో ఏర్పాటుచేసిన ఏడు సీసీ కెమెరాల ఏర్పాటును ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాలు ప్రోత్సహించిన రాజలింగం,అజయ్, మాజీ సర్పంచ్ నాగయ్య గ్రామ పోలీస్ అధికారి శంకర్ గ నల్గొండ రూరల్ ఎస్ఐ సైదా బాబు లను డీఎస్పీ అభినందించారు.