6 April, 2026 | 3:45 AM

రేషన్ షాపును సీజ్ చేసిన డీటీ (సివిల్ సప్లై) మోబినోల్ల

06-04-2026 01:48 AM

దేవరకొండ (గుండ్లపల్లి),  ఏప్రిల్ 5 : గుండ్లపల్లి మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి  గ్రామంలో గల రేషన్ షాపును దేవరకొండ డిటి (సివిల్ సప్లై) మోబినోల్ల ఆదివారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రేషన్ సరుకుల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు.

రికార్డుల ప్రకారం ఉండాల్సిన నిల్వలకు, షాపులో ఉన్న సరుకులో తేడాలు ఉండటంతో నిబంధనల ఉల్లంఘన కింద అధికారులు సదరు రేషన్ షాపును సీజ్ చేశారు. అనంతరం డీల్ప 6-ఏ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.