10-06-2025 10:56:41 PM
హర్షం వ్యక్తం చేసిన కాటారం సబ్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు..
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహోదరుడు దుద్దిల్ల శీను బాబు(Duddilla Srinubabu)ను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినారు. దీనిపై తమ ప్రియతమ నాయకుడు దుద్దిల్ల శీను బాబుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రావడంతో కాటారం సబ్ డివిజన్లోని కాంగ్రెస్ యూత్ నాయకులు కటకం అశోక్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాటారం, మహా ముత్తారం, మలహల్రావు, పలిమెల, మండలాలలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్, ప్రభాకర్ రెడ్డి, సడవలి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపిటిసి సుధాకర్, కాలేశ్వర దేవస్థానం డైరెక్టర్ కుంభం పద్మ, మండల ఉపాధ్యక్షులు కోట సమ్మయ్య, మండల అధికార ప్రతినిధి శివరాజ్, అయిత తిరుపతిరెడ్డి, మైనార్టీ టౌన్ అధ్యక్షులు నైముద్దీన్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు రంజిత్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ నాగరాజు, చేకూర్తి శంకర్, హరీష్, కాల్వ గంగయ్య, లడ్డు, సమ్మయ్య, కృష్ణమూర్తి, సదానందం, చెన్నూరు వెంకటయ్య, రాజయ్య, మోతి సమ్మయ్య, మాజీ సర్పంచ్ మోతే సాంబయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.