40 ఎకో టూరిజం స్పాట్లు గుర్తింపు
22-06-2024 09:47 PM
హైదరాబాద్ : ఎకో టూరిజంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎకో టూరిజం అభివృద్ధి కోసం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామనన్నారు. అందుకోసం రాష్ట్రంలోని 12 సర్క్యూట్ లలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఎకో టూరిజం విధానాలపై అధ్యయనం చేసి పీపీపీ విధానంలో ఎకో టూరిజం అభివృద్ధికి నిధులను సమీకరించినట్లు కొండా సురేఖ వెల్లడించారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి మంత్రి కొండా సురేఖను ఛైర్మన్ గా.. మరో 16 మంది అధికారులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.






