బోనాల ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
22-06-2024 09:28 PM
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే బోనాల పండుగలు త్వరలోనే రానున్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణ వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న బోనాల ఏర్పాట్లపై సమీక్షించారు. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. బోనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ప్రధాన ఆలయాలకు 3 రోజుల్లో బోనాల ఉత్సవ కమిటీలను నిర్వహిస్తారు. జోగినీలు బోనాలు సమర్పించేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ సంస్కృతి, ప్రతిష్ఠ ప్రతిబింబించేలా బోనాలు నిర్వహించాలన్నారు.






