calender_icon.png 18 July, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీట్

18-07-2025 12:03:06 AM

  1. గురుగ్రామ్ షికోపూర్ భూముల వ్యవహారంపై
  2. వాద్రాకు చెందిన 36 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

గురుగ్రామ్, జూలై 17: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ తన చార్జిషీట్‌లో తాజాగా రాబర్ట్ వాద్రాకు చెందిన రూ. 36 కోట్ల విలువైన 43 ఆస్తులను అటాచ్ చేసింది. కాగా షికోపూర్ భూముల వ్యవహారం కేసులో వాద్రాను పలుమార్లు ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది.

ఈడీ ప్రకారం వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గురుగ్రామ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఒంకారేశ్వర్ ప్రాపర్టీ  నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ నూ. 7.5 కోట్లు. ఈ తర్వాత వాద్రా కంపెనీ సదరు భూమిని డీఎల్‌ఎఫ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి రూ. 58 కోట్లకు విక్రయించింది. ఈ నేపథ్యంలో డీల్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి.

దీంతో రంగంలోకి దిగిన ఈడీ విచారణ కొనసాగిస్తుంది. ఈ కేసుకు సంబంధించి 2018 సెప్టెంబర్‌లో వాద్రా పేరు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. ఆయనతో పాటు హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, డీఎల్‌ఎఫ్ రియల్ ఎస్టేట్ సంస్థ పేర్లు ప్రస్తావించారు.