13-06-2025 02:29:36 AM
ప్రభుత్వ వసతులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, జూన్ - 12( విజయక్రాంతి )విద్యతోనే సమాజంలో ఆర్థిక అసమానతలు దూరమవుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణం గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల యునిఫామ్స్, పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వ హించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.720 మంది విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాలు,యునిఫామ్స్ ఇతర సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు.