11 July, 2026 | 7:15 PM

Breaking News

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •   ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •  

విద్యా వ్యవస్థను పటిష్ట పరిచేందుకే విద్యా వారోత్సవాలు

14-05-2026 04:40 PM

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు పంపండి..జిల్లా కలెక్టర్ దీపక్ . 

తాండూరు,(విజయక్రాంతి):  విద్య వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకే విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని...ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  గాను తగు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి విద్యాధికారులను ఆదేశించారు.  గురువారం వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ఎంఈఓ ఇందు ప్రియ ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు ,కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన విద్యాబోధన అందిస్తున్నామని... గతం కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఫలితాలు బాగా మెరుగుపడ్డాయని అన్నారు. అనంతరం తాండూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు- శీల్డులను అందజేసి అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ , కమిషనర్, తాండూరు తహసిల్దార్ తారా సింగ్, ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు