10-02-2026 12:05:45 AM
మేడ్చల్, ఫిబ్రవరి 9(విజయ క్రాంతి):మెడ్చల్మల్కాజ్గిరి జిల్లాలోని మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ లో భాగంగా పోలింగ్కు ముందురోజు 10న, పోలింగ్ రోజున 11న, ఓట్ల లెక్కింపు రోజున 13న జిల్లాలో ఎన్నికల నోటిఫై చేసిన ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలలు/జూనియర్ కళాశాలలకు కలెక్టర్ మను చౌదరి సెలవు ప్రకటించారు. పోలింగ్/కౌంటింగ్ కోసం గుర్తించబడిన విద్యా సంస్థల భవనాలు షెడ్యూల్ ప్రకారం ఎన్నికల అధికారుల వినియోగానికి అందుబాటులో ఉంచాలని, పోలింగ్ సిబ్బందికి అప్పగించాల్సిందిగా ఆదేశించారు.