విద్యాసంస్థల బంద్ విజయవంతం
23-06-2026 04:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్య సంస్థల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో నిర్వహించిన బంద్ మంగళవారం విజయవంతమైంది. ఏబీవీపీ నాయకులు దినేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రవేటు పాఠశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని నినాదాలు చేశారు. శివ కుమార్ మణిరాజ్ మనీ నితీష్ వంశీ సాయి అభి అక్షయ్ పాల్గొన్నారు.






