12 March, 2026 | 10:20 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

మాఘ అమావాస్యకు రూ.16.87 లక్షల ఆదాయం

19-01-2026 12:19 PM

గతేడాది కంటే ఈసారి రూ.3.74 లక్షలు పెరిగిన ఆదాయం

విజయక్రాంతి,పాపన్నపేట: దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం మాఘ అమావాస్యకు భక్తులు పోటెత్తారు. వేలాదిమంది భక్తజనం మంజీరాలో పుణ్యస్నానం ఆచరించారు. మాఘ అమావాస్య రోజున స్పెషల్ దర్శనం, ఒడి బియ్యం, కేశఖండనం, కుంకుమార్చన, మొక్కుబడి, సత్రము, విరాళాలు, అమ్మవారి ప్రసాదం టికెట్లపై రూ.16,87,215 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. 2025లో రూ.13,13,170 ఆదాయం రాగా, 2026లో రూ.16,87,215 ఆదాయం వచ్చిందని, గతేడాది కంటే ఈసారి రూ.3,74,045 అధికంగా ఆదాయం వచ్చిందని వెల్లడించారు.