calender_icon.png 21 June, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచముఖి హనుమాన్ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

21-06-2025 06:43:18 PM

తన సహకారం ఎల్లవేళలా ఉంటుంది..

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్..

కామారెడ్డి (విజయక్రాంతి): పంచముఖి హనుమాన్ ఆలయ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(State Government Advisor Shabbir Ali) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నూతన పాలకవర్గ సభ్యులను కోరారు. తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని షబ్బీర్ అలీ తెలిపారు. 

పంచముఖి హనుమాన్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి  ఆలయ కమిటీ  చైర్మన్ గా వైద్య కిషన్ రావు. డైరెక్టర్లుగా, కొత్త భీమరాజ్, దాసోజు శ్రీనివాస్, రెడ్డి గంగమని, గజవాడ శంకరయ్య లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  మాట్లాడుతూ... పంచముఖి హనుమాన్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా  పురాతన మైనది, అత్యంత మహిమలు గలదని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని స్వామి వారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 

కోరికలు కోరుకున్న వారికి నెరవేరుతాయని అన్నారు. ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి నా  వంతు శాయశక్తుల కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగుల శ్రీనివాస్, పుట్నాల శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.