31-05-2025 12:19:19 AM
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
-రూ.93 లక్షల యూజిడి పనులకు శంకుస్థాపన
పటాన్ చెరు, మే 30 : జీహెచ్ఎంసీ పరిధిలోని రామచంద్రపురం, భారతీనగర్, పటాన్ చెరు డివిజన్ల పరిధిలో మౌలిక వస తుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జెపి కాలనీ, చైతన్య నగర్ కాలనీలలో రూ.93 లక్షల వ్యయంతో చేపట్టనున్న యుజిడి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ల పరిధిలో నూతన అంతర్గత రహదారులు, యుజిడీల నిర్మాణ పనులకు నిధులు కేటాయిస్తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, హెచ్ఎండబ్ల్యూఎస్ డీజీఎం శివకృష్ణ, సీనియర్ నాయకులు కొమరగూడెం వెంకటేష్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళను సద్వినియోగం చేసుకోవాలి...
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రంగారావు, ఎంపీడీవో యాదగిరి, గృహ నిర్మాణ శాఖ డిఈ రవీందర్, గ్రామీణ నీటిపారుల శాఖ డిఈ శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఐలాపూర్లో రూ.100 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణానికి కసరత్తు
పటాన్ చెరు, మే 30 : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నూతన సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని డీఈలు, ఏడీఈలతో విద్యుత్ సరఫరా, పంపిణీ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టులో భాగంగా రామచంద్రాపురం, భారతీ నగర్, పటాన్ చెరు డివిజన్ల పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు కోసం సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ సమావేశంలో డీఈ భాస్కరరావు, ఏడీఈలు సంజీవ్, దుర్గా ప్రసాద్, తులసి రామ్ పాల్గొన్నారు.